ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అనా కొణిదెల (Anna Lezhneva) తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) దర్శనార్థం రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సాయంత్రం ఆమె రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విషయం జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. రేపు (సోమవారం) వేకువజామున తిరుమలలో సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది.
Kailasapatnam : బాణసంచా ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తాజాగా సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో తమ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో దీనికి కృతజ్ఞత సూచనగా తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడం కోసం ఆమె తిరుమలకు చేరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి అనుగ్రహంతో తన కుమారుడు బాగున్నాడని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. రీసెంట్ గా సింగపూర్లోని ఓ కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం కోలుకున్న మార్క్ను పవన్ కళ్యాణ్ మరియు అనా కొణిదెల స్వదేశానికి తీసుకొచ్చారు.
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీఎం #PawanKalyan గారి సతీమణి #AnnaLezhneva గారు pic.twitter.com/XR4fuqskDp
— VALLURU KIRAN JANASENA (@KIRANJSP111) April 13, 2025
కొడుకు #MarkShankar తో కలిసి ఇండియాకి తిరిగి వచ్చిన @pawankalyan గారు 🙏🏻❤️🥺#MarkShankarPawanovich #PawanKalyan #AnnaLezhneva pic.twitter.com/Ck3nr1lv6e
— PeoplesLeaderPawanKalyan (@PeoplesLeaderPK) April 12, 2025