Site icon HashtagU Telugu

Pawan Kalyan: నాదేండ్ల ను విడుదల చేయకపోతే విశాఖ వస్తా పోరాడతా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Own Goal

Pawan Kalyan Own Goal

Pawan Kalyan: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు అరెస్ట్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.

‘‘ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి? ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి’’? అని పవన్ ప్రశ్నించారు.

ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోందని అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపిందని ఆయన అన్నారు. అయితే మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నామని పవన్ మండిపడ్డారు. మనోహర్ ని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలని, ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తాను. ప్రజల తరఫున పోరాడతాను అని పవన్ తేల్చి చెప్పారు.

Also Read: Yuvagalam: ‘యువగళం’ తో నారా లోకేశ్ రికార్డు, పాదయాత్ర 3వేల కి.మీ పూర్తి!