Site icon HashtagU Telugu

Anakapalle Ticket: అనకాపల్లిలో జనసేనకు తలనొప్పి

Anakapalle Ticket

Anakapalle Ticket

Anakapalle Ticket: అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తలనొప్పి మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఇద్దరు జనసేన నేతలు బరిలోకి దిగేందుకు సిద్దమవుతుండటం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. మాజీ మంత్రి, రెండుసార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన కొణతాల రామకృష్ణ కూడా ఈ స్థానం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానంపై పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు కన్నేశారు.

కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. జనవరి 25, 2024న పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 2019లో నరసాపురం పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన నాగబాబు వైఎస్సార్‌సీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. ఘురామకృష్ణంరాజు మళ్లీ టిడిపి లేదా బిజెపి నుండి పోటీ చేయబోతున్నందున, కాపు సామాజికవర్గం గణనీయమైన సంఖ్యలో ఉన్న అనకాపల్లి పార్లమెంట్ స్థానం కోసం నాగబాబు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కొణతాల రామకృష్ణ కూడా ఇదే సీటుపై కన్నేసారు.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల రామకృష్ణతో భేటీ అయ్యారు. వైఎస్ షర్మిల చేరికపై పుకార్లు కూడా వ్యాపించాయి, అయితే రామకృష్ణ సంయమనం పాటించారు, కుటుంబ సంబంధాలు ఉన్నందున ఈ భేటీ వ్యక్తిగతమని, ఆమె తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి మాత్రమే వచ్చానని చెప్పి పుకార్లకు స్వస్తి పలికారు. కాగా జనసేన ఇప్పుడు అనకాపల్లి, గుంటూరు, లేదా మచిలీపట్నం మరియు కాకినాడ స్థానాలను అడుగుతున్నట్లు పార్టీ అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి.

Also Read: Acidity: మారుతున్న సీజ‌న్‌.. గ్యాస్‌, ఎసిడిటీ నుంచి ఉప‌శ‌మనం పొందండిలా..!