Konaseema Violence: ప్రభుత్వ వైఫల్యాలు జనసేనపై మోపకండి..హోంమంత్రికి పవన్ హితవు.!

కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఈ ఉద్రిక్తతలకు కారణం అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Konaseema violence

Konaseema violence

కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఈ ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నిరసనకారులు అమలాపురంలో కదంతొక్కారు. మంత్రి పినపె విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల నివాసాలకు అగ్గిపెట్టారు. అంతకుముందు పోలీసుల వాహనాలపైనా రాళ్లు రువ్వారు.

ఈ పరిణామాలపట్ల జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.ఉద్రికత్త పరిస్థితుల కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసని స్పష్టం చేశారు. హోమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ వైఫల్యాలు జనసేనపై మోపకండి అంటూ హోంమంత్రికి హితవు పలికారు పవన్.

కాగా అమలాపురంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో సర్కార్ విఫలమైందన్నారు. పాలనా లోపాలను కప్పిప్పుచ్చుకువడానికే సమస్యలను స్రుస్టిస్తున్నారని, పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని పవర్ మండిపడ్డారు. ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని..శాంతియుత పరిస్థితుల కోసం ప్రతిఒక్కరూ సహకరించాలని పవన్ హితవు పలికారు. అంబేద్కర్ పేరును వివాదాల్లోకి మార్చడం దురద్రుష్టకరమన్నారు.

  Last Updated: 25 May 2022, 12:06 AM IST