Site icon HashtagU Telugu

Onion prices : రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలు..గగ్గోలు పెడుతున్న రైతులు

Onion Price

Onion Price

కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు (Onion prices ) గణనీయంగా పడిపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా క్వింటాల్‌కి రూ. 1200కు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసే ఉల్లి ధర, ఇప్పుడు నాణ్యతను బట్టి రూ. 50 నుండి రూ. 450కి పడిపోయింది. ఈ ధరల పతనం కర్నూలు మార్కెట్‌లోని రైతులకు భారీ నష్టాలను మిగిల్చింది. నిల్వలు పెరిగిపోవడం, కొత్త పంట రాకతో ఈ సమస్య మరింత జఠిలమైంది. రైతులు తమ పంటకు సరైన ధర లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

GST Reform: గుడ్ న్యూస్‌.. ఈ వ‌స్తువుల‌పై భారీగా త‌గ్గిన ధ‌ర‌లు!

ఈ పరిస్థితికి ప్రధాన కారణం మార్కెఫెడ్‌ వద్ద నిల్వలు గణనీయంగా పెరిగిపోవడమే. రైతుల నుండి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో మార్కెఫెడ్ తమ నిల్వలను వ్యాపారులకు విక్రయించాలని నిర్ణయించింది. తొలుత వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, తరువాత నాణ్యత ఆధారంగా కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఈ కొనుగోళ్లు సుమారు 800 టన్నుల వరకు జరిగాయి.

ఉల్లి ధరల పతనం రైతుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ జోక్యం, సరైన ధరల నియంత్రణ విధానాలు ఉంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు. రైతులను ఆదుకునేందుకు మార్కెఫెడ్, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు, వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. ఈ సంక్షోభం ఉల్లి రైతులకు ఒక పెద్ద సవాలుగా మారింది.