Site icon HashtagU Telugu

AP News : ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. లబ్ధిదారుల పునర్విచారణ..

AP Government guidelines on allotment of house plot

AP Government guidelines on allotment of house plot

AP News : కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ, విచారణ తప్పదని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలైన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద మంజూరైన ఇళ్ల స్థలాలు, పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల వివరాలను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అర్హులు, అనర్హుల జాబితాను స్పష్టంగా వేరు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

పునర్విచారణపై స్పష్టమైన ఆదేశాలు
ఈ నేపథ్యంలో, పథకం కింద ఇళ్ల స్థలాలు, పట్టాలు పొందిన లబ్ధిదారులపై పునర్విచారణ జరిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే వారిని గుర్తించాలని స్పష్టమైన ఆదేశాలు అందించాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా డేటాను సరిగ్గా నమోదు చేసేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. రెవెన్యూ అధికారులు గుర్తించిన అనర్హుల సమాచారాన్ని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వాధికారులు చేపట్టారు.

New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఆ నలుగురికి బెర్త్.. ఎమ్మెల్యేల టఫ్ ఫైట్

ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన
పునర్విచారణ ప్రక్రియను మండల స్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, వీఆర్వో సభ్యులుగా ఉండే బృందాలు ఇళ్ల స్థలాలు, పట్టాలు పొందిన లబ్ధిదారులను పరిశీలిస్తాయి. ఈ సమీక్ష ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా 26 జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌ఏ జయలక్ష్మి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

పరిశీలన వెనుక అసలైన ఉద్దేశం
ఇళ్ల స్థలాల కేటాయింపులో జరిగిన అక్రమాలను బహిర్గతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూటమి నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వం తమ అనుకూలమైన వ్యక్తులకు అక్రమంగా ఇళ్ల పట్టాలను కేటాయించిందనే ఆరోపణలతో ఈ సమీక్ష చేపట్టారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఈ పునర్విచారణ ద్వారా నిజాలు బయటపడతాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

YCP : వైసీపీకి కాస్త ఊపిరి పోసిన కీలక నేత