TDP : క్యాడ‌ర్‌కు భ‌రోసా ఇస్తున్న నారా భువ‌నేశ్వ‌రి.. ఉమ్మ‌డి తూ.గో జిల్లాలో నిజం గెల‌వాలి కార్య‌క్ర‌మం

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 07:41 AM IST

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ స‌మ‌యంలో మ‌ర‌ణించిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తున్నారు. అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. మొదటగా పి.గన్నవరం నియోజకవర్గం, ఐనవల్లి మండలం, ఎస్.మూలపాలెం గ్రామంలో పార్టీ కార్యకర్త మోరెంపూడి మీరాసాహెబ్ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మీరాసాహెబ్(52) 25-10-2023న మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతిచెందారు. మీరాసాహెబ్ భార్య దుర్గమ్మ, తమ్ముడు బాలరాజును భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. అనంతరం అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, చల్లపల్లి గ్రామంలో సాలాది వివ్వనాథం కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక విశ్వనాథం(58) 20-10-2023న గుండెపోటుతో మృతిచెందారు. విశ్వనాథం భార్య ఆదిలక్ష్మి, కుమార్తెలు జీవనజ్యోతి, రత్నకుమారి, కాంతలక్ష్మి లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం, విశ్వేశ్వరాయపురం గ్రామంలో పార్టీ కార్యకర్త చెల్లుబోయిన నరసింహారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. నరసింహారావు(57), 09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతిచెందారు. నరసింహారావు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు చంద్రకాంత్ లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించారు. రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త సరెళ్ల పెద్దిరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక పెద్దిరాజు(57), 17-10-2023న గుండెపోటుతో మృతిచెందారు. పెద్దిరాజు కుమారుడు రాంబాబు, కోడలు నాగలక్ష్మి, మనుమరాలు జాస్మిన్ లను భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు.

Also Read:  Gyanvapi Mosque : హిందూ ఆలయంపైనే జ్ఞానవాపి మసీదు.. ఏఎస్‌ఐ సంచలన నివేదిక

మండపేట నియోజకవర్గం, కపిలేశ్వరపురం మండలం, నల్లూరు గ్రామంలో పార్టీ కార్యకర్త జొన్నకూటి రాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. రాజు కుమార్తె అన్నపూర్ణ, కుమారుడు విజయ్ కుమార్ లను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. చివరిగా మండపేట నియోజకవర్గం, మండపేట మండలం, పాలతోడు గ్రామంలో మందపల్లి ధర్మరాజు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ధర్మరాజు(51), 17-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. ధర్మరాజు భార్య మందపల్లి జ్యోతి, కుమార్తెలు వినీల, ప్రమీళ, కుమరుడు వరుణ్ లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. రూ.3లక్షల ఆర్థికసాయం చేసి ధైర్యం చెప్పారు. అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బలభద్రపురం గ్రామంలో బస చేశారు.