హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆర్టీసీ బస్సు నడిపి ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని హిందూపురం ఆర్టీసీ డిపోలో ప్రారంభించిన తర్వాత, ఆయన స్వయంగా బస్సు డ్రైవింగ్ సీటులోకి వెళ్లి తన నివాసం వరకు బస్సు నడిపారు. ఈ కార్యక్రమం అక్కడి ప్రజలందరినీ ఆకట్టుకుంది, అభిమానులు, స్థానికులు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.
CM Revanth Reddy: పెట్టుబడుల రక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి
బస్సు ప్రయాణం అనంతరం.. బాలకృష్ణ ‘స్త్రీ శక్తి’ పథకం వివరాలను తెలియజేశారు. ఈ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణికులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చని ఆయన చెప్పారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి, మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి చూపించవచ్చని స్పష్టం చేశారు.
Rohit Sharma: రోహిత్ శర్మ వన్డేలకు దూరం కానున్నాడా?
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఈ పథకం వారి ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపడుతోందని, ఈ పథకం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని తెలిపారు. మహిళలు, బాలికలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తమ రోజువారీ పనులు, విద్య మరియు ఇతర ప్రయాణ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హిందూపురంలో బస్సు నడిపిన #బాలయ్య 🥰❤️🔥
మరో సూపర్ సిక్స్ హామీ, “స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం” ప్రారంభం.
హిందూపురం RTC బస్ స్టేషన్ నుండి చౌడేశ్వరి కాలనీ మీదగా తన నివాసం వరకు బస్సు నడిపిన నందమూరి బాలకృష్ణ గారు. #NandamuriBalakrishna#HindupurMLA pic.twitter.com/MxQdEABYRR
— ʀᴀᴋʜɪ ᵐᵃʰᵃʳᵃᵃʲ ɴʙᴋ ✨️ (@RakhiNbk) August 15, 2025