Site icon HashtagU Telugu

Mysore Rajamata : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత భారీ విరాళం.. ప్రమోదాదేవి గురించి తెలుసా ?

Mysore Rajamata Pramoda Devi wadiyar Tirumala Temple Ttd Andhra Pradesh

Mysore Rajamata : ప్రమోదా దేవి.. మైసూరు రాజమాత. మైసూరు రాజ కుటుంబానికి భక్తిభావం ఎక్కువ. వీరు తిరుమల శ్రీవారిని ఆరాధిస్తుంటారు. దాదాపు 300 ఏళ్ల క్రితం అప్పటి మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి వెండి అఖండ దీపాలను విరాళంగా ఇచ్చారు.  తాజాగా ఇప్పుడు  మైసూరు రాజమాత ప్రమోదా దేవి కూడా రెండు భారీ వెండి అఖండ దీపాలను మైసూర్ సంస్థానం తరపున తిరుమల శ్రీవారికి అందజేశారు.  రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో  సీహెచ్ వెంకయ్య చౌదరి‌, టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌లకు  వాటిని  ఆమె అందించారు. ఒక్కో వెండి అఖండ దీపం దాదాపు 50 కిలోల బరువు ఉంటుంది. వీటిని శ్రీవారి గర్భగుడిలో వెలిగిస్తుంటారు. అంతకుముందు మైసూర్ మహారాజు యదువీర్ క్రిష్ణదత్త చామరాజ్ వడియార్, రాజమాత ప్రమోదాదేవి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాజమాతకు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను బీఆర్ నాయుడు అందించారు.

Also Read :Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?

మైసూరు రాజమాత ప్రమోదా దేవి గురించి.. 

Also Read :Trumps Advisors: ట్రంప్‌ సలహా సంఘంలోకి ఇద్దరు ఉగ్రవాదులు ?