TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్య‌ర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్య‌లు.. ఆయ‌న ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్‌

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 09:29 AM IST

ఎన్టీఆర్ జిల్లాలో రాజ‌కీయాలు వేడెక్కాయి. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో ఎంపీ కేశినేని నాని త‌న‌దైన శైలిలో ప్ర‌త్య‌ర్థుల‌పై ఘాటుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ కార్యాల‌య ప్రారంభోత్స‌వంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్య‌ర్థి కొలికపూడి శ్రీనివాస్ కలెక్షన్స్ కోసం మాత్రమే వచ్చాడని.. ఎలక్షన్స్ కోసం కాదన్నారు. తానే వైసీపీలో జాయిన్ అయ్యి 50 రోజులూ అయింద‌ని.. 50 రోజుల్లో 100 సచివాలయాలు ప్రారంభించాన‌న్నారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సచివాలయంలు కట్టించార‌ని.. ఒక్క సచివాలయం కట్టలేని చంద్రబాబు గొప్పవాడా? రాష్టంలో 11 వేలు సచివాలయంలు కట్టిన జగన్ గొప్పవాడో ప్ర‌జ‌లే చెప్తార‌న్నారు. కుప్పంలో కూడా నీళ్లు ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డేన‌ని.. 30 సంవత్సరాలుగా కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంలో నీళ్లు ఇవ్వలేద‌న్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్‌దేన‌న్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్న వ్యక్తి జగన్ అని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మాత్ర‌మేన‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు పనికిమాలిన కొడుకు లోకేష్ కల్లు తాగే కొండముచ్చుని తిరువూరు కి పంపాడ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కొలకపూడి శ్రీనివాసరావుతో చర్చించడానికి స్వామిదాస్ అవసరం లేదని..త‌మ‌ వైఎస్ఆర్ కార్యకర్తలు వ‌స్తార‌ని తెలిపారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైద‌రాబాద్ నుంచి వ‌చ్చాడ‌ని.. అప్పుడు మూడు నెలలు కొలిక‌పూడిని తానే ఓ హోటల్ లో చంద్ర‌బాబు చెపితే పెట్టించాన‌ని.. అత‌ని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారని తెలిపారు. అదే హోటల్ ఉండి అరాచకాలు చేస్తుంటే హోటల్ కాళీ చేపించండి అంటూ హోటల్ వాళ్ళు త‌న‌ను బ్రతిమిలాడే పరిస్థితికి వచ్చారని.. హోటల్ ఖాళీ చేపించడానికి తాను నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింద‌ని కేశినేని నాని అన్నారు. అమరావతి నుండి తిరువూరుని ఏం ఉద్ధరించడానికి వ‌చ్చాడ‌ని ప్ర‌శ్నించారు. తిరువూరులో టీడీపీలో అలి బాబా 40 చోర్ లు ఉన్నారు.. వాళ్లకు కొత్తవారు వస్తే డబ్బులు కావాల‌న్నారు. అలీబాబా 40 దొంగలను మించిన దొంగలకే దొంగని చంద్ర‌బాబు తిరువూరు పంపించారని వ్యాఖ్య‌లు చేశారు. తిరువూరు టీడీపీ అభ్యర్థి ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తిరువూరు లో ఉన్న డాక్టర్లు,వ్యాపారులు తెలుసుకోవాల‌ని.. అరాచకవాది మిమ్మల్ని కూడా బెదిరించి డబ్బులు లాగుతాడ‌ని కామెంట్స్ చేశారు.

Also Read:  Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువ‌నేశ్వ‌రి