MLA vs Lokesh: బాబు,లోకేష్ పై ఎమ్మెల్యే వంశీ ఫైర్‌….మీ ఇద్ద‌రు ఇప్ప‌టికైనా….?

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ పై టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ మ‌రోసారి ఫైర్ అయ్యారు.

  • Written By:
  • Updated On - November 10, 2021 / 10:06 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ పై టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ మ‌రోసారి ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు,బీజేపీతో క‌లిసి రాష్ట్రంలో డ్రామాలాడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీ ప్ర‌భుత్వం పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని సోము వీర్రాజు, చంద్ర‌బాబు నానా యాగీ చేస్తున్నార‌ని…గ‌తంలో రూ.50 ఉన్న ధ‌ర‌ల‌ను అమాంతం పెంచి ఇప్పుడు అర‌కొర‌క‌గా కేంద్రం త‌గ్గించింద‌న్నారు. బీజేపీని టీడీపీ భ‌య‌ప‌డుతుంద‌ని అందుకు కార‌ణం ఐటీ దాడులు, ఓటుకు నోటు కేసులేన‌ని వంశీ ఆరోపించారు.గ‌తంలో ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు చేసి మోడీ ప్ర‌భుత్వాన్ని దించుతాన‌ని చంద్ర‌బాబు స‌వాల్ చేశార‌ని..కానీ ఇప్పుడు టీడీపీ ఎంపీల‌ను బీజేపీలోకి పంపి నాట‌కాలాడుతున్నార‌ని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు. బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్ బీజేపీ,టీడీపీ పొత్తు పెట్టుకుంటాయ‌ని బ‌ద్వేల్ ఎన్నిక‌లకు రెండు రోజుల ముందు చెప్పార‌ని…బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకోవ‌డానికి టీడీపీని క‌లుపుకునిపోవాల‌ని చూశార‌ని తెలిపారు.

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌పై తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎందుకు ధర్నాలు చేయడం లేదని ఎమ్మెల్యే వంశీ ప్ర‌శ్నించారు. టీడీపీ జాతీయ పార్టీ అన్న‌ప్పుడు అక్క‌డ కూడా ధ‌ర్నాలు నిర్వ‌హించాల‌ని…చంద్ర‌బాబు చ‌నిపోయిన త‌రువాత కూడా స్వ‌ర్గంలో కూడా పార్టీని పెడ‌తార‌ని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కి చెందిన కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని… పెట్రోల్ కి కూడా కులాన్ని పెడతార‌ని వంశీ అన్నారు. 3సార్లు సీఎం గా, 3సార్లు ప్రతిపక్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా బుద్ది జ్ఞానము తెచ్చుకొని మాట్లాడాలని హిత‌వు ప‌లికారు. చంద్రబాబుకి వయస్సు అయిపోతుంద‌ని… గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు టీడీపీ కార్యకర్తలు చంద్ర‌బాబుని న‌మ్మెద్ద‌ని ఆయ‌న అన్నారు. లోకేష్ కి అసలు ఏమీ తెలియదని…పాఠశాలల‌పై అవగాహన లేకుండా… స్క్రిప్ట్ పట్టుకొని లోకేష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు మీద ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింద‌ని… యాజ‌మాన్యం నడపలేకపోతే ప్రభుత్వం నడుపుతుంది అని చెప్పిందని ఎమ్మెల్యే వంశీ తెలిపారు.