RK Roja: అపోలో ఆస్పత్రిలో చేరిన మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆమె కాలు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

RK Roja: ఆంధ్రప్రదేశ్ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆమె కాలు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్నీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మంత్రి రోజా కాలు బెణకడంతో కొంత కాలంగా ఆమె ఫిజియో చికిత్స తీసుకున్నారు. అయితే ఈ మధ్య నొప్పి ఎక్కువ అవ్వడంతో రోజాను కుటుంబ సభ్యులు చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉండనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పది రోజులు ఆమె తన నగరి నియోజకవర్గానికి దూరంగా ఉండనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read More: Tiktoker-Death : టిక్‌టాక్ ‘స్కార్ఫ్ గేమ్’ కు బాలిక బలి