Site icon HashtagU Telugu

Relationships in AP & TS:ఎఫైర్లపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో సంచలన విషయాలు

Relationship

Relationship

దేశంలోని స్త్రీ పురుషుల లైంగిక భాగస్వాములకు సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.పురుషులకంటే మహిళలే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉందని వెల్లడయింది. జీవిత భాగస్వామికాని వాళ్లతో సంబంధం కలిగి ఉన్న పురుషుల శాతం 4 శాతం ఉండగా.. మహిళలు 0.5 శాతం మంది ఉన్నట్టు సర్వే నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక పురుషుడు 1.7 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండగా, మహిళ 1.5 మందితో శారీరక బంధాన్ని కొనసాగిస్తోంది.
2019-21 కాలానికి గాను 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో .. 1.1 లక్షల మంది మహిళలు, 1.1 లక్ష మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయగా ఈవివరాలు వెల్లడయ్యాయి.

ఏపీ, తెలంగాణలలో..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో మహిళలు గతేడాది 0.4 శాతం మంది కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉండగా, ఇది పురుషుల్లో 2.1 శాతంగా ఉంది.

ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా..

* సర్వే ప్రకారం.. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్‌, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని వెల్లడైంది.
* ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాజస్తాన్ (పురుషుల్లో 1.8 శాతం, స్త్రీలలో 3.1 సెక్స్ పార్టనర్స్) ఈ విషయంలో టాప్ లో ఉండటం గమనార్హం.
* రాజస్తాన్ లో సగటున ఒక మహిళ.. 3.1 మందితో లైంగికసంబంధం కలిగి ఉండగా, పురుషుడు 1.8 మందితో లైంగికసంబంధం కలిగి ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.