Site icon HashtagU Telugu

Nara Lokesh : ప్రముఖ సంస్థల ప్రతినిధులతో నారా లోకేష్‌ వరుస భేటీలు

Nara Lokesh Davos

Nara Lokesh Davos

Nara Lokesh : ప్రపంచ ఆర్థిక సదస్సు (వల్డ్ ఎకనామిక్ ఫోరం)లో భాగంగా దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ- ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, సాంకేతిక అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులను ఆహ్వానించేందుకు ఆయన అనేక విషయాలపై చర్చిస్తున్నారు.

India Playing 11: నేడు ఇంగ్లండ్‌తో భార‌త్ తొలి టీ20.. టీమిండియా జ‌ట్టు ఇదే!
ఉబర్‌తో కొత్త ఆలోచనల చర్చ
ఉబర్‌ ఉపాధ్యక్షుడు మధుకానన్‌తో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్‌‌ పలు వినూత్న ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా:

కృతిమ మేధపై రౌండ్‌టేబుల్‌ చర్చ

దావోస్‌లో నిర్వహించిన కృతిమ మేధపై రౌండ్‌టేబుల్ సమావేశంలో లోకేష్‌‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఏఐ సిటీ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వివరించారు. సాంకేతికతలో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.

కార్గిల్‌ సంస్థతో చర్చలు

కార్గిల్‌ సంస్థ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ వెబ్‌స్టర్‌తో సమావేశమైన లోకేష్‌‌.. రాష్ట్రంలో ఫీడ్, మిల్లింగ్‌ ప్లాంటు, ఫుడ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుపై చర్చించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలకు సహకారం.. ఎడిబుల్‌ ఆయిల్‌ విభాగంలో ప్రాసెసింగ్‌ సంస్థలతో భాగస్వామ్యాల ప్రతిపాదనలపై సానుకూల చర్చలు జరిగాయి.

ఈవై ఇండియా సీఈవోతో భేటీ

ఈవై ఇండియా సీఈవో రాజీవ్‌ మెమానితో జరిగిన సమావేశంలో విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ ఏర్పాటు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రాముఖ్యతనిచ్చారు.

డీహెచ్‌ఎల్‌ సీఈవోతో లాజిస్టిక్స్‌ పథకాలు

డీహెచ్‌ఎల్‌ సీఈవో ప్లాబో సీయానోతో జరిగిన సమావేశంలో.. రాష్ట్రంలో లాజిస్టిక్స్‌ బిజినెస్‌ సెంటర్లు. ఆహార, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల సౌకర్యాల విస్తరణ. స్కిల్‌ డెవలపమెంట్‌ సెంటర్లు ప్రాజెక్టులపై డీహెచ్‌ఎల్‌ అనుకూలంగా స్పందించింది.

భారత్‌ ఫోర్జ్‌తో రక్షణ రంగంపై చర్చలు

భారత్‌ ఫోర్జ్‌ వైస్‌ ఛైర్మన్‌ కల్యాణితో జరిగిన సమావేశంలో.. మడకశిరలో రక్షణ పరికరాల తయారీ యూనిట్‌ ఏర్పాటుపై చర్చించారు. అలాగే.. రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ డీ, శిక్షణ కేంద్రాలు.. కొత్త ఐటీఐల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు.. మడకశిరలో రూ.2,400 కోట్లతో యూనిట్‌ ఏర్పాటుకు భారత్‌ ఫోర్జ్‌ చర్యలు చేపట్టింది.

దసాల్డ్‌తో అమరావతి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు

దసాల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌తో సమావేశంలో.. అమరావతి అభివృద్ధి కోసం డిజిటల్‌ సాంకేతిక సేవలు.. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు చర్చించారు.

దావోస్‌లో మంత్రి లోకేష్‌‌ సమావేశాలు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధికి దారులు తెరవనున్నాయి. ఈ చర్చలు అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికతలో ముందు వరుసలో నిలబెట్టే దిశగా సాగుతున్నాయి.

White Pepper Vs Black Pepper : నల్ల, తెల్ల మిరియాల్లో వంట, ఆరోగ్యానికి ఏది మంచిది?

Exit mobile version