Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేసుకు అత్యంత కీలకమైన దాదాపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను సిస్టమ్ నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్య కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని న్యాయస్థానం గతంలో […]

Published By: HashtagU Telugu Desk
SIT's sensational report on Sai Krishna's death.

SIT's sensational report on Sai Krishna's death.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేసుకు అత్యంత కీలకమైన దాదాపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను సిస్టమ్ నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు నిర్ధారించారు.

వివరాల్లోకి వెళితే.. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్య కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని న్యాయస్థానం గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, సిట్ అధికారులు సంబంధిత ఆధారాలను పరిశీలించగా, ఆ నెల రోజుల ఫుటేజ్ స్థానంలో కేవలం రెండు రోజులకు సంబంధించిన దృశ్యాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన కీలక డేటాను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి మరీ ఫుటేజ్‌ను మాయం చేయడం ఈ కేసులో పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం, తొలగించిన ఫుటేజ్‌ను డేటా రికవరీ నిపుణుల సహాయంతో తిరిగి సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, ఈ ఫుటేజ్‌ను ఎవరు తొలగించారు? దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు.

 

  Last Updated: 23 Jun 2026, 11:19 AM IST