Mudragada: 12న వైసీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ..!

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 12:29 PM IST

 

Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం…వైసీపీ(ysrcp) పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీ లోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). ఇక ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం(Pithapuram) బరిలో ఉండే ఛాన్స్‌ ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు బిగ్ షాక్ ఇచ్చేనందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan) సిద్ధం అయ్యారు. పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడ పద్మనాభం బరిలో దింపనున్నారట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడను బరిలో దింపనున్నారట. దింతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారట. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం బరిలో ఉండే ఛాన్స్‌ ఉంది.

read also : Lok Sabha: నేడు లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న బీజేపీ ..?