AP : పవన్ పై కాపు నేత పోటీ..జగన్ ఏమన్నా ప్లానా..?

  • Written By:
  • Updated On - March 2, 2024 / 11:25 AM IST

గత ఎన్నికల్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను రెండు చోట్ల ఓడగొట్టామో…మరోసారి అలాగే పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించాలని జగన్ (Jagan) చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫై గట్టి నేతను బరిలోకి దింపాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫై అదే సామజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుండి పోటీ చేయగా..రెండు చోట్ల ఓటమి చెందారు. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తూ తనకు ఎక్కువ అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. గాజువాక , భీమవరం ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని మొన్నటి వరకు వార్తలు వినిపించిన..ప్రస్తుతం మాత్రం పవన్ పిఠాపురం నుండి బరిలోకి దిగాలని చూస్తున్నాడట.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నియోజకవర్గంలో 91,000 కాపుల ఓట్లు ఉన్నాయి. కాపు ఓట్లన్నీ జనసేనకు పడతాయని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చేనందుకు సీఎం జగన్ మరో ప్లాన్ చేసినట్లు అంత మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడ ఫ్యామిలీ సభ్యుడ్ని బరిలో దింపాలని చూస్తున్నారట. అదే సామజిక నేతను దించితే బాగుంటుందని , పోటీ కూడా గట్టిగా ఉంటుందని , ఈజీ గా పవన్ కళ్యాణ్ ను ఓడించగొట్టొచ్చని జగన్ స్కెచ్ వేస్తున్నాడట. ఇప్పటికే కాపు నేతలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం తో ఉన్నారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ చేస్తుండడం , 24 స్థానాల్లో బరిలోకి దిగుతుండడం ఇవన్నీ కాపు సంఘాలకు నచ్చడం లేదు. వీటిని జగన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే పవన్ ఫై అదే కులానికి చెందిన వ్యక్తిని దింపితే విజయం వైసీపీ కే వరిస్తుందని భావిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు

Follow us