Ambati Rambabu : జగన్ నెక్స్ట్ షాక్ ఇవ్వబోయేది అంబటికేనా…?

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 08:43 PM IST

ఈసారి ఏపీ ఎన్నికలు మాములుగా ఉండబోవని అర్ధం అవుతుంది..గత ఎన్నికల్లో ఈజీ గా విజయం సాధించిన వైసీపీ (YCP) ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకోబోతుంది. టీడీపీ – జనసేన కూటమి గా బరిలోకి దిగడం , మరోపక్క షర్మిల సైతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి బరిలోకి దిగుతుండడంతో ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (jagan)..ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో ఏమాత్రం మొహమాటపడడం లేదు. ఎంత దగ్గరి వారికైనా సరే..వారి నియోజకవర్గం లో వ్యతిరేకత ఉంటె టికెట్ ఇచ్చేది లేదని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఇప్పటికే మంత్రులకు , సిట్టింగ్ ఎమ్మెల్యే లకు టికెట్ ఇవ్వకుండా వారి ప్లేస్ లో కొత్తవారికి ఇచ్చారు. దీంతో టికెట్ దక్కని నేతలు ..పార్టీకి రాజీనామా చేసి , ఇతర పార్టీలలో చేరిపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే గుడివాడ అమర్నాథ్, జయరాం వంటి మంత్రులకు షాక్ ఇచ్చిన జగన్..నెక్స్ట్ అంబటి రాంబాబు (Ambati Rambabu) కు షాక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ ఫిక్స్ అయ్యాడట. అంబటి కి టికెట్ ఇస్తే దగ్గర ఉండి ఓడిస్తామని వైసీపీ నేతలు ఇప్పటికే జగన్ కు అల్టిమేటం జారీ చేసారు. నియోజకవర్గం లో జగన్ చేయించిన సర్వే లో కూడా అంబటి కి పూర్తి వ్యతిరేకత వచ్చిందట. దీంతో ఈసారి ఆయనకు కాకుండా ఆయన సోదరుడు అంబటి మురళికి టికెట్ ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యాడని వినికిడి. అయితే సత్తెనపల్లి టిక్కెట్ తనదేనని అంబటి రాంబాబు భావిస్తున్నారు. అప్పుడే ప్రచారం సైతం మొదలుపెట్టారు. విన్యాసాలు సైతం ప్రారంభించారు. టీ పెట్టడం, నలుగురితో టీ తాగడం, దోసెలు వేయడం వంటి వాటితో బిజీబిజీగా ఉన్నారు. కానీ జగన్ స్కెచ్ మరోలా ఉందని అంటున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో అని నియోజకవర్గ పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.

Read Also : BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్