Site icon HashtagU Telugu

Sharmila : దొంగ పత్రాలు సృష్టించి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ – షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Jagan Is The One Who Created Fake Documents And Did Injustice Sharmila

Jagan Is The One Who Created Fake Documents And Did Injustice Sharmila

వైఎస్ కుటుంబం(YS Family)లో ఆస్తుల వివాదం(Property Controversy) మరోసారి చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై ఆయన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పవర్ ప్రాజెక్ట్ షేర్లను తమ అనుమతి లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి బదిలీ చేసుకున్నారంటూ ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో జగన్, ఆయన భార్య భారతి, క్లాసిక్ రియాల్టీ సంస్థపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలైన విషయం ఈ వివాదానికి మరింత ఊతమిచ్చింది.

Vamanarao murder case : వామనరావు హత్య కేసు.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

షర్మిల మాట్లాడుతూ.. తల్లికి మరియు తల్లితనానికి చేసిన అన్యాయం తీరదని, జగన్ చరిత్రలో మోసగాడిగా మిగిలిపోతారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ్ముడైన జగన్ తన తల్లి విజయమ్మకు ఇచ్చిన సరస్వతి పవర్ షేర్లను తిరిగి కోర్టులో కేసు వేసి తానే స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. ‘ఇది తల్లిపై కేసు వేసిన కుమారుడిగా, మేనల్లాడు మరియు మేనకోడలిపై ఆస్తుల కోసం చర్యలు తీసుకున్న మేనమామగా జగన్ చరిత్రలో గుర్తుండిపోతారు’ అని వ్యాఖ్యానించారు.

ఈ వివాదం 2024 అసెంబ్లీ ఎన్నికల వేళ తెరపైకి రావడంతో రాజకీయంగా ఇది పెద్ద చర్చకు దారి తీసింది. వైఎస్ కుటుంబంలో అభివృద్ధికి పునాదులు వేసిన వారికే ఇప్పుడు ఆస్తుల కోసం పగలు పెరిగిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల వాదనలపై జగన్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, షేర్ల బహుమతి ఒప్పందం ఇంకా అమలవ్వలేదని పేర్కొన్నారు. అయితే షర్మిల మాత్రం తల్లికి ఇచ్చిన షేర్లను తిరిగి కోర్టులో కోరడం అనైతికమని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం రాజకీయ రంగు దాల్చడంతో దీనిపై వైసీపీ వర్గంలో కూడా చర్చలు ఊపందుకున్నాయి.