Site icon HashtagU Telugu

AP Police Department : పోలీస్ శాఖను మూసేయడం బెటర్ – హైకోర్టు అసంతృప్తి

High Court angered by AP Education Commissioner

High Court angered by AP Education Commissioner

ఆంధ్రప్రదేశ్‌లో చట్ట వ్యవస్థపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల టీటీడీ పరకామణి కేసులో లోక్ అదాలత్‌లో రాజీ రికార్డుల సీజ్ విషయంలో సీఐడీ చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు మండిపడింది. సెప్టెంబర్ 19న కోర్టు ఇప్పటికే ఆ రికార్డులను సీజ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటి వరకు ఏ చర్య తీసుకోకపోవడాన్ని గమనించిన హైకోర్టు, “ఏపీ పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉంది. ఇలాగే వ్యవహరించాలంటే డిపార్టుమెంటును మూసేయడం మంచిది” అని వ్యాఖ్యానించింది. న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయడంలో పోలీసులు చూపుతున్న నిర్లక్ష్యం రాష్ట్ర పరిపాలనపై చెడు ప్రభావం చూపుతుందని కోర్టు పేర్కొంది.

‎Lizard: పూజ గదిలో దేవుడి ఫోటోల వెనక బల్లి కనిపించిందా.. ఇది దేనికి సంకేతమో తెలుసా?

సీఐడీ తరఫున హాజరైన అధికారులు తమ వాదనలో, “సీజ్ అధికారాలు గల ఐజీ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది కాబట్టి ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోయాం” అని పేర్కొన్నారు. ఈ వివరణపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం తెలుపి లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారు. కానీ ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం పోలీస్ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు కోర్టు నుంచి రావడం, పోలీస్ శాఖలో పరిపాలనా లోపాలను, అంతర్గత వ్యవస్థలో సమన్వయ లోపాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

న్యాయ నిపుణుల అభిప్రాయాల ప్రకారం, హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శలు కాదు, పరిపాలనా వ్యవస్థకు హెచ్చరిక. ముఖ్యంగా చట్ట అమలు సంస్థలు కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఆలస్యం చేయడం, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. మరోవైపు, టీటీడీ పరకామణి కేసు వంటి సున్నితమైన అంశంలో పోలీసులు సక్రమంగా స్పందించకపోవడం ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ పరిణామంతో ఏపీ పోలీస్ శాఖలో అంతర్గత బాధ్యతా వ్యవస్థను పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version