Trending

Visakhapatnam : విశాఖకు క్రికెట్ ఫీవర్.. 23న ఇండియాతో ఆస్ట్రేలియా ఢీ.. నేటి నుంచే టికెట్ల సేల్స్

Visakhapatnam : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం భార‌త జ‌ట్టు ఆసీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది.

Published By: HashtagU Telugu Desk
Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం భార‌త జ‌ట్టు ఆసీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌లోని మొద‌టి మ్యాచ్ విశాఖ‌ప‌ట్నం వేదికగా ఈనెల 23న (గురువారం) జ‌ర‌గ‌నుంది. చాలా గ్యాప్ తర్వాత మన విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. దీని కోసం 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తామని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) వెల్లడించింది.

ఆఫ్‌లైన్ టికెట్ల సేల్స్‌ ఇలా.. 

ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొన్నవారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈనెల 22 వరకు రీడీమ్ చేసుకోవచ్చు. విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో ఈనెల 23 వరకు టికెట్లను రీడీమ్‌ చేసుకోవచ్చు. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు విక్రయించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

భార‌త్‌, న్యూజిలాండ్ సెమీ ఫైన‌ల్ కోసం.. 

ఈరోజు భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రగ‌నున్న సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏసీఏ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. వైజాగ్‌ ఆర్కే బీచ్‌ వద్ద కాళీ మాత టెంపుల్‌ ఎదురుగా, విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో, వైఎస్సార్‌ కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేలా సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు చెప్పారు. సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ను ఉచితం చూడొచ్చని ఎలాంటి టికెట్(Visakhapatnam) అవ‌స‌రం లేద‌న్నారు.

Also Read: Whats Today : ఏపీలో కుల గణన షురూ.. నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన

  Last Updated: 15 Nov 2023, 08:39 AM IST
Exit mobile version