ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు (Illegal Relationship) అనేవి రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. కుటుంబం , పిల్లలు , చక్కటి భర్త ఉన్నప్పటికీ కొంతమంది మహిళలు..పడక సుఖం కోసం పక్కదారులు పడుతున్నారు. తమ కుటుంబం కోసం భర్త ఎంత కష్టపడుతున్నారనేది అర్ధం చేసుకోకుండా కట్టుకున్న భర్త ను మోసం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. భర్త గల్ఫ్ లో కష్టపడుతూనే..ఇక్కడ ఈమె మాత్రం పరాయి వ్యక్తులతో పడక సుఖం పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఒకరి తో కాదు ఇద్దరితో గడుపుతూ..చివరికి ప్రియుడి చేతిలో హత్య కాబడింది.
We’re now on WhatsApp. Click to Join.
వివరాల్లోకి వెళ్తే..
రెల్లుగడ్డ ప్రాంతానికి చెందిన బంతు మణికుమారి.. భర్త గత కొంత కాలంగా గల్ఫ్లో ఉంటున్నాడు. ఆమె మాత్రం అత్తమామలతో కలిసి రెల్లుగడ్డ గ్రామంలో ఉంటుంది. ఈక్రమంలో ఆమె ఇంటి పక్కన ఉన్న కొంబత్తుల నవీన్ కుమార్ స్నేహం పెంచుకొని..ఆ తర్వాత ఆ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెల్సుకున్న అత్తామామాలు..ఈ విషయాన్నీ తమ కొడుకు కు చెప్పడంతో..పెద్దల ముందు పంచాయితీ పెట్టడంతో మణికుమారి..నవీన్ ఇకపై కలుసుకోమని చెప్పి హామీ ఇచ్చారు. కొంతకాలం దూరంగా ఉన్న ఇద్దరు..కొన్ని రోజుల తర్వాత మళ్లీ కలుసుకోవడం చేసారు. ఇదే క్రమంలో గతంలో మాదిరి మణికుమారి..తనతో అంత దగ్గరిగా ఉండకపోయేసరికి..నవీన్ కు అనుమానం వచ్చింది. ఏంటా అని ఆరాతీయగా..ఆమె అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తో గడుపుతుందని తెలుసుకొని తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఈమెను హాంతం చేయాలనీ అనుకున్నాడు. తాజాగా ఆమె వంటగదిలో ఫోన్ మాట్లాడుతుండగా..వెనుకనుండి వెళ్లి కత్తి తో దాడి చేసాడు. ఈ దాడి లో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడం తో నవీన్ అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ కోసం గాలిస్తున్నారు.
Read Also : Mahesh Babu Abhibus : మహేష్ అభి బస్ కొత్త యాడ్ చూశారా.. డైరెక్టర్ ఎవరంటే..?