Kuppam : కుప్పంలో మరో సారి ఉద్రిక్త‌త‌.. అన్న క్యాంటీన్ పై దాడి

కుప్పంలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. నిన్న‌(సోమ‌వారం) రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో అన్న క్యాంటీన్ వ‌ద్ద

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 10:10 AM IST

కుప్పంలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. నిన్న‌(సోమ‌వారం) రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో అన్న క్యాంటీన్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ధ్వ‌సం చేశారు. అయితే వైసీపీ నాయ‌కులు చేసిన ప‌ని అని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల పై దాడి జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. కుప్పం ఆర్టీసి బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసీపీ నేత‌లు అర్థరాత్రి దాడి చేసి ధ్వంసం చేయడాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లు రద్దు చేశారని… ఇప్పుడు పేద వాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామ‌ని.. కుప్పంలోని అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వైసిపి రౌడీ మూకల పై కఠిన చర్యలు తీసుకోవాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు.