AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే 13-19 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు స్కూల్ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ డిజిటల్‌ పోర్టల్‌కు మంచి స్పందన వస్తోంది. డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ-లెర్నింగ్‌ ద్వారా ఆరోగ్య విద్యను చేరువ చేసేలా చర్యలు చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. […]

Published By: HashtagU Telugu Desk
Ap Health And Wellness

Ap Health And Wellness

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే 13-19 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు స్కూల్ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ డిజిటల్‌ పోర్టల్‌కు మంచి స్పందన వస్తోంది. డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ-లెర్నింగ్‌ ద్వారా ఆరోగ్య విద్యను చేరువ చేసేలా చర్యలు చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 13-19 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం కోసం ‘స్కూల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం (ఎస్‌హెచ్‌డబ్ల్యూపీ)’ డిజిటల్‌ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. apshwp.ap.gov.in పోర్టల్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉండేందుకు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ డిజిటల్ పోర్టల్‌ను రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో టీచర్లు, లెక్చరర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. వీరు ఈ పోర్టల్‌ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరిస్తారు.

విద్యార్థులకు పలు అంశాలపై డిజిటల్‌ పాఠ్యాంశాలను వీడియోలు, ప్రజెంటేషన్లు, డాక్యుమెంట్ల రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ టాపిక్స్‌లో మెటబాలిక్‌ హెల్త్‌, రోడ్ సేఫ్టీ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అవగాహన, పోషణ – జీవనశైలి, మానసిక ఆరోగ్యం, రక్తహీనత వంటివి ఉన్నాయి. నైతిక విలువలు, పౌష్టికాహారం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత వంటి పలు అంశాలపై వీరికి అవగాహన కల్పిస్తారు. క్విజ్‌లు, ఆన్‌లైన్ పరీక్షలు కూడా ఉంటాయి. వీటిలో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు కూడా జారీ చేయాలని అధికారులు ఏర్పాటు చేశారు.

దేశంలోనే తొలిసారి ‘స్కూల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం’ను డిజిటలైజ్‌ చేసి ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు తగిన విధంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 36,297 మంది విద్యార్థులు సరికొత్త విషయాలు తెలుసుకున్నారని, వీరిలో 75 శాతం మంది బాలికలు ఉన్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘స్కూల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం’ పోర్టల్ ద్వారా 11 ప్రధాన అంశాల సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అవగాహన కల్పించాలని అధికారులు అంటున్నారు. పేరు, మొబైల్‌ నంబరు, మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వొచ్చు అని వారు చెబుతున్నారు.

 

  Last Updated: 28 Mar 2026, 01:36 PM IST