Site icon HashtagU Telugu

Angallu Case: అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ రిజర్వ్

Angallu Case

Angallu Case

Angallu Case: అంగల్లు హింసాత్మక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. శుక్రవారం కూడా అదే విధంగా రిజర్వ్ చేసే అవకాశముంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో కొందరికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని, ఈ క్రమంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని చంద్రబాబు తరఫు న్యాయవాది తెలిపారు.

అన్నమయ జిల్లాలోని అంగల్లులో ఆగస్టు 4న జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరు పట్టణంలో టీడీపీ అధినేత సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఘటనలు చోటు చేసుకున్నాయి.

కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడుని గత నెలలో సిఐడి అరెస్టు చేసిన కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు బుధవారం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ, ఈ కేసులో అక్టోబర్ 16 వరకు చంద్రబాబును అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తనయుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ కేసులో లోకేష్‌ను నిందితుడిగా పేర్కొనలేదని, అందుకే అరెస్టు చేయడం లేదని సీఐడీ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ కేసులో లోకేష్‌ను నిందితుడిగా చేర్చినట్లయితే, అతన్ని ప్రశ్నించడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్టికల్ 41A ప్రకారం నోటీసు జారీ చేస్తామని సిఐడి పేర్కొంది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో అక్టోబర్‌ 10, 11 తేదీల్లో 41ఏ కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ లోకేష్‌ను ప్రశ్నించింది.

Also Read: Israel Hamas war: గాజాకు విద్యుత్, ఇంధనం, నీళ్లు కట్ : ఇజ్రాయెల్ మంత్రి

Exit mobile version