Site icon HashtagU Telugu

Investment : వామ్మో ఏపీలో గూగుల్ 50 వేల కోట్ల పెట్టుబడి..యూఎస్ తర్వాత వైజాగే !!

Google Investments In Vizag

Google Investments In Vizag

విశాఖపట్నంలో గూగుల్ (Google) భారీ ఎత్తున పెట్టుబడులు (Investment ) పెట్టబోతుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. గతంలో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. అయితే ఏ విభాగంలో ఈ పెట్టుబడులు పెడతారన్న దానిపై ఇప్పుడు స్పష్టత వస్తోంది. అమెరికా తర్వాత గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఒక గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ విశాఖపట్న(Vizag)లో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను నిర్మించడానికి 6 బిలియన్ డాలర్లు (మన రూపాయల్లో సుమారు 50 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ భారీ పెట్టుబడిలో 2 బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఇంధన సామర్థ్యం (రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ) కోసం కేటాయిస్తారు. ఇది డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ను అందిస్తుంది. ఈ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్దదిగా ఉంటుందని, సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లలో గూగుల్ డేటా సెంటర్ విస్తరణలో భాగంగా ఉంటుందని రాయిటర్స్ పేర్కొంది.

BRS MLA Defection Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్ పై స్పందించిన స్పీకర్

ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ను ఒక టెక్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, విశాఖపట్నంలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారా లోకేష్ ప్రకటించారు. ఈ చర్యలు విశాఖను అంతర్జాతీయ టెక్ కంపెనీలకు ఒక ప్రముఖ గమ్యస్థానంగా మారుస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినా, కొన్ని కారణాల వల్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.

గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థ విశాఖలో ఇంత భారీ పెట్టుబడి పెట్టడం వల్ల స్థానికంగా వేలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం ఇస్తుంది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంది.