AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

AP Police Holidays  విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. పండుగలు, పబ్బాలకు దూరంగా, కుటుంబ వేడుకలకు హాజరు కాలేక తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా, వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల […]

Published By: HashtagU Telugu Desk
AndhraPradesh Police Special Leaves

AndhraPradesh Police Special Leaves

AP Police Holidays  విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. పండుగలు, పబ్బాలకు దూరంగా, కుటుంబ వేడుకలకు హాజరు కాలేక తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా, వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అన్ని ర్యాంకుల వారికి ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ విభాగాల అధిపతులకు ఆదేశాలు పంపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప, సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, సెలవు మంజూరు చేయడం తప్పనిసరి అని ఆదేశాల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి జీవితంలో ముఖ్యమైన ఈ రెండు రోజుల్లోనైనా కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక సెలవుల ద్వారా సిబ్బంది మానసికంగా ఉల్లాసం పొంది, విధుల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెన్షనర్లకు కొత్త నిబంధన

మరోవైపు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఫిజికల్ (మాన్యువల్) పద్ధతిలో పెన్షన్ ప్రతిపాదనలను సమర్పించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా ‘నిధి’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  Last Updated: 14 Apr 2026, 12:59 PM IST