Tirumala: తిరుమలలో ఉగ్రవాదుల కలకలం.. ఫేక్ మెయిల్ అంటూ క్లారిటీ ఇచ్చిన ఎస్పీ

వైకుంఠక్షేత్రంగా పేరొందిన తిరుమల (Tirumala)కు సంబంధించిన ఓ న్యూస్ కలకలం రేపుతోంది. అభయారణ్యంలోకి ఉగ్రవాదులు (Terrorists) ప్రవేశించినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా అందిన సమాచారం కలకలం రేపుతోంది.

  • Written By:
  • Updated On - May 2, 2023 / 10:21 AM IST

వైకుంఠక్షేత్రంగా పేరొందిన తిరుమల (Tirumala)కు సంబంధించిన ఓ న్యూస్ కలకలం రేపుతోంది. ఏడుకొండలస్వామి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు కొండకు వస్తుంటారు. అలాంటి అభయారణ్యంలోకి ఉగ్రవాదులు (Terrorists) ప్రవేశించినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా అందిన సమాచారం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి పంపిన ప్రధాన సమాచారంతో తిరుపతి అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కొండపై విస్తృత తనిఖీలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు తిరుమలలో భద్రతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కానీ కొండపై ఉగ్రవాదుల కదలిక లేదని.. ఈమెయిల్ ద్వారా వచ్చిన సమాచారం అవాస్తవమని చెప్పారు. ఇది నకిలీ మెయిల్ ఐడీగా గుర్తించారు.

తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ వచ్చిన ఫేక్ మెయిల్‌పై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి స్పందించారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని, ఆకతాయి మెయిల్‌గా భావిస్తున్నామని చెప్పారు. భక్తులు అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. ఫేక్ మెయిల్ విషయంపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు.

Also Read: Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు

తిరుమలలో ఉగ్రవాదుల భయం

తిరుమల కొండపైకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం తిరుపతి అర్బన్ పోలీసులతో పాటు టీటీడీ భద్రతా అధికారులకు కూడా చెమటలు పట్టించింది. గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ ద్వారా పంపిన ఈ సమాచారంతో కొండపైన పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో బ్యాగులు, ఇతర లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

భక్తుల బ్యాగులు తనిఖీ

ఈమెయిల్ ద్వారా వచ్చిన సమాచారాన్ని తిరుపతి అర్బన్ పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో టీటీడీ భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే గత కొద్ది రోజులుగా చేనేత కార్మికుల సమ్మె నేపథ్యంలో పారిశుధ్య కార్మికుల రూపంలో తిరుమలకు వచ్చిన ఉగ్రవాదుల రూపంలో విచారణ జరుగుతోంది. వీరు విధులు నిర్వహిస్తున్న చోట్ల అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.