Punganur Violence: బెయిల్ ప్రయత్నాల్లో దేవినేని ఉమా

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు చెలరేగాయి

Punganur Violence: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు చెలరేగాయి. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు సీఎం చంద్రబాబుని ఏ1గా, ఏ2గా దేవినేని ఉమాని చేర్చారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, ఈ క్రమంలోనే అక్కడ అల్లర్లు చెలరేగాయని పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తనపై కేసు నమోదైన నేపథ్యంలో ఏ సమయంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చని భావించిన దేవినేని ఉమా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు వైజాగ్ లో మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా దానిని రద్దు చేసుకుని బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

Also Read: Ritika Nayak :పింక్ డ్రెస్ లో మరింత హాట్ గా కనిపిస్తున్న బుట్టబొమ్మ