డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ రద్దు. బెయిల్ రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు. సుబ్రమణ్యం హత్యకేసులో నలుగురు సాక్షులను ప్రలోభపెట్టిన అనంతబాబు. సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును ఏప్రిల్ 24న అరెస్టు చేసిన పోలీసులు.
ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు హత్య కేసులో బెయిల్ పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు. సాక్షులను బెదిరించినట్లు ఆధారాలతో నిరూపణ కావడంతో బెయిల్ రద్దు. నిబంధనలను ఉల్లంఘించినందుకు బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. బెయిల్ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యేవరకు జైలులోనే ఉండనున్న అనంతబాబు.
ఈనెల 20 నుంచి డ్రైవర్ హత్యకేసు రెగ్యులర్ విచారణ ప్రారంభించనున్నట్లు తెలిపిన కోర్టు.
