Site icon HashtagU Telugu

Women’s Day : మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి

CM Chandrababu Naidu's face-to-face with women

CM Chandrababu Naidu's face-to-face with women

CM Chandrababu : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్‌లో మార్కాపురం రానున్నారు. ఉదయం.10.55 వరకూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. తరువాత అధికారులతో సమావేశమై సభా వేదికకు చేరుకుంటారు. అనంతరం స్టాల్స్‌ను సందర్శించి రుణాల పంపిణీ, మహిళలతో ముఖాముఖితోపాటు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై, జిల్లా అధికారులతో సమీక్ష చేస్తారు.

Read Also: Heart Attack : ఇలా చేస్తే గుండెపోటును ముందే గుర్తించవచ్చు

ఈ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి రంగాలలో చేపడుతున్న పథకాలు, గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు సాగునీటి పథకాలు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. అలాగే, మార్కాపురం ప్రాంతంలో సాగు వ్యవస్థకు సంబంధించిన వివిధ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి ఇచ్చే అవకాశం ఉంది. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలతో ముఖాముఖీ సంభాషణ నిర్వహించడంతో పాటు, ప్రజాసేవలో నూతన మార్గాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సీఎం చంద్రబాబుతో పంచుకోవడానికి ఆసక్తి చూపించనున్నారు.

ఇక, సీఎం పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, సభా వేదిక ఏర్పాట్లను కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎస్‌పీ దామోదర్‌, జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, సబ్‌కలెక్టర్‌ త్రివినాగ్‌, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ దామోదర్‌ మాట్లాడుతూ.. అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ ద్వారా సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని, సీఎం కాన్వాయ్‌ రూటును పరిశీలించారు. ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఈయన వెంట అడిషనల్‌ ఎస్పీ నాగేశ్వరరావు, ఎస్‌ఎస్‌జీ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌జీ డీఎస్పీ పోతురాజు, డీఎస్పీలు నాగరాజు, శ్రీనివాసరావు, సాయి ఈశ్వర్‌ యశ్వంత్‌, సీఐలు రాఘవేంద్ర, సుబ్బారావు పాల్గొన్నారు.

Read Also: Rajeev Shukla: బీసీసీఐ రాజీవ్ శుక్లాకు మ‌రో కొత్త బాధ్యత!