కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

Ap Cm Chandrababu Naidu  టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార సారథి బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన పేరును కుటుంబ సాధికార సారథిగా.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేశారు. ఆయనకు మొత్తం 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ కుటుంబ సాధికార సారథుల […]

Published By: HashtagU Telugu Desk
Chandrababu Naidu

Chandrababu Naidu

Ap Cm Chandrababu Naidu  టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార సారథి బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన పేరును కుటుంబ సాధికార సారథిగా.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేశారు. ఆయనకు మొత్తం 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ కుటుంబ సాధికార సారథుల పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిగా పార్టీ కార్యకర్తల్ని నియమించారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి వ్యవస్థను నియమించారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా కుటుంబ సాధికార సారథిగా నమోదయ్యింది. చంద్రబాబు పేరును చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేయడం విశేషం. కడపల్లె పంచాయతీలో చంద్రబాబు కూడా సాధారణ కార్యకర్తలా టీడీపీ కుటుంబ సాధికార సారథిగా బాధ్యతల్లో ఉన్నారన్నమాట.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని కడపల్లె పరిధి శివపురంలో నివాసాన్ని నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబును కూడా కడపల్లె పంచాయతీలో టీడీపీ తరఫున ప్రతినిధిగా కుటుంబ సాధికార సారథి బాధ్యతలను నిర్వర్తించనున్నారు. చంద్రబాబుకు తిమ్మరాజు పల్లె పోలింగ్ బూత్ నంబర్ 49లోని 181 నుంచి 240 వరకు ఉన్న 60మంది ఓటర్లకు కుటుంబ సాధికార సారథి వ్యవహరిస్తారు. అక్కడి ఓటర్లను కలిసి కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, ఎలా లబ్ధి పొందారు, పెండింగ్‌ సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు చంద్రబాబు కుటుంబ సాధికార సారథిగా ఇప్పటికే ఓటర్లను ఒకసారి కలిశారు. గతేడాది జూలై 2న తిమ్మరాజుపల్లెలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అభిప్రాయాలను సేకరించారు.

ముఖ్యమంత్రిగా బిజీగా ఉండే చంద్రబాబుకు కూడా పార్టీలో సాధారణ కార్యకర్త నిర్వహించే బాధ్యతల్ని అప్పగించడం విశేషం. గతేడాది నెల రోజుల పాటూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కుటుంబ సాధికార సారథుల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుల వరకు అందరూ ప్రజల్ని కలిశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి వివరాలు తెలియజేశారు. అయితే చంద్రబాబుకు కూడా కుటుంబ సాధికార సారథి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

 

  Last Updated: 12 Mar 2026, 11:10 AM IST