ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) రాష్ట్ర పింఛన్దారులకు (Pensioners) తీపి కబురు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు జూన్ 1న పెంచిన పింఛన్ ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా తో తెలిపారు. బుధువారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు..ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న సీఎం ఛాంబర్లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ సీఎం మొదటి సంతకం చేశారు. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు… ఎస్జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్స్ 7725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రజలను అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు.
2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి రూ.200 ఉన్న పింఛన్ను 5 రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు. ఆ తర్వాత దాన్ని 2 వేలకు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్ను రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పింఛన్ పెంపు హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న, కొత్తగా పెంచిన పింఛన్ 4 వేలు, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను వెయ్యి రూపాయల చొప్పున పెరిగిన మొత్తం రూ. 3 వేలు కలిపి రూ. 7 వేల పింఛన్ను అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్దిదారులకు 4 వేల రూపాయల పింఛన్ అందనుంది.
అలాగే పేదలకు రూ. 15కే కడుపునిండా భోజనం పెట్టె అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు. సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. ఇందుకుగాను అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 31 కోట్లు ఖర్చుచేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్..అన్న క్యాంటీన్లు మూసివేయించారు. అయినా టీడీపీ నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇప్పుడు చెప్పినట్లే అన్న క్యాంటీన్ల దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టారు.
Read Also : Oracle : 2లక్షల విద్యార్థులకు క్లౌడ్, AI టెక్లో శిక్షణనిస్తున్న ఓరాకిల్