CBN Is Back : జైలు నుండి బయటకు వచ్చాక మీడియా తో చంద్రబాబు ఏమన్నారంటే..

తెలుగు ప్రజలందరకీ నమస్కారాలు అభినందనలు. నేను (CBN) కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారు

  • Written By:
  • Updated On - October 31, 2023 / 05:16 PM IST

CBN Is Back : 52 రోజులు తర్వాత జైలు నుండి చంద్రబాబు బయటకు వచ్చారు. చంద్రబాబు ను చూసేందుకు వేలాదిగా టీడీపీ కార్యకర్తలు , అభిమానులు రాజమండ్రి జైలు వద్దకు వచ్చారు. జై బాబు .. జై జై బాబు అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఎటు చూసిన టీడీపీ జెండాలతో , కార్యకర్తలతో కోలాహలంగా మారింది.

సరిగ్గా 4:16 గంటలకు జైలు నుంచి చంద్రబాబు (CBN) బయటకు వచ్చారు. జైలు నుండి బాటకు వస్తూ టీడీపీ శ్రేణులు, అభిమానులు, తెలుగు ప్రజలకు అభివాదం చెప్పారు. ఇక మనవడు దేవాన్ష్‌ను ఎత్తుకొని ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత మీడియా తో మాట్లాడుతూ..”తెలుగు ప్రజలందరకీ నమస్కారాలు అభినందనలు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చేసిన అభివృద్ధిని కూడా మీరు వివరించారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికీ రాదు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు.. చేయనివ్వను. నాకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. అక్రమ అరెస్టును ఖండించిన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు. సైబర్‌ టవర్స్‌ 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నేను చేసిన కార్యక్రమాల వల్ల లబ్ధిపొందిన ఐటీ ఉద్యోగులంతా అందులో పాల్గొన్నారు” అని చంద్రబాబు (Chandrababu) తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజమండ్రి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు (CBN) విజయవాడకు చేరుకుంటారు. రేపు సాయంత్రానికి తిరుమల చేరుకొని , ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు, చికిత్సలు చేయించుకుంటారు.

మరోపక్క చంద్రబాబు కు బెయిల్ (Chandrababu Bail) రావడం ఫై యావత్ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు (Skill Development case)లో సెప్టెంబర్ 9న చంద్రబాబు ను నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. అనంతరం 10న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 52 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail)నే ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినా దగ్గరి నుండి కూడా ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు ట్రై చేస్తూ వస్తున్నప్పటికీ..వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్య గా చంద్రబాబు ఫై అనేక కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసింది. ఇదే క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయనకు బెయిల్ మంజుల చేయాలనీ హైకోర్టు ను కోరారు. దీంతో ఏపీ హైకోర్టు (AP High Court) చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు (Chandrababu), టీడీపీ అభిమానులకు కోర్టు తీర్పు సంతోషాన్ని కలిగించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 28న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే పలు షరతులు విధించింది.

Read Also : Chandrababu : 52 రోజులు తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు..