MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు గాను వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Mp Vijayasai Reddy

Mp Vijayasai Reddy

MP Vijayasai Reddy: వైఎస్ షర్మిల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. షర్మిల తన అన్న వైఎస్ఆర్సీపీ పార్టీపై విమర్శలు చేస్తుండటంతో వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తూ ఎటాకింగ్ కి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు గాను వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లాంటి వెన్నెముక లేని పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ విశ్వసించరని అన్నారు.

2019లో కాంగ్రెస్‌కు నోటా కంటే తక్కువ ఓట్లు రావడానికి ఇదే కారణం అని ఆయన వ్యాఖ్యానించారు. పాత ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయ పద్ధతిలో విభజించారని దుయ్యబట్టారు. ఏపీ చరిత్రలో కాంగ్రెస్‌ విలన్ పాత్ర పోషించిందని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారు.రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు..పదేళ్ల తర్వాత అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు.

వైఎస్సార్‌సీపీ మాజీ అధినేత్రి వైఎస్‌ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పదోన్నతి పొందినప్పటి నుంచి అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. జగన్‌కు వ్యతిరేక నాయకురాలిగా ఆమె ఆవిర్భవించడం , తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతోంది.

Also Read: Jagan : అసెంబ్లీ లో జగన్ లాస్ట్ స్పీచ్..అభివృద్ధి..నష్టాలపై ఎమోషనల్

  Last Updated: 06 Feb 2024, 05:57 PM IST