Botsa: చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారు: బొత్స సత్యనారాయణ

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పై విమర్శలు గుప్పించారు.

  • Written By:
  • Updated On - June 19, 2022 / 10:10 AM IST

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క మాట కూడా చంద్రబాబు మాట్లాడలేదని తన నియోజకవర్గానికి వెళ్ళి తాను ఒక ఫలితం లేని వ్యక్తిని అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అలాగే ఆ పనికిమాలిన తనానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని తెలిపారు.

బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని,బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో లేక హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెపుతారని అన్నారు బొత్స సత్య నారాయణ అన్నారు. అలాగే కేవలం మమ్మీ, డాడీ అని పిలవడం కోసమే ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని అందుకేనా మీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు బొత్స.

అలాగే పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే అన్న ఉద్దేశంతో బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారని తెలిపారు బొత్స సత్యనారాయణ.