BC Janardhan Reddy : కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న అపశృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయం పునరుద్ధరణలో భాగంగా ఇటీవల నిర్వహించిన కుంభాభిషేకం, దివ్య కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, రహదారులు, భవనాలు, మౌలిక వసతులు , పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసు అధికారులపై దాడికి పాల్పడిన సంఘటనపై బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బీసీ జనార్ధన్ రెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, “ఆలయం వద్ద విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్పై చేయి చేసుకోవడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాడులు ప్రజా ప్రభుత్వంలోకి తగవు. ప్రజా సేవలో నిమగ్నమైన పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం చేయడం అత్యంత అపశకునంగా భావించాలి. నేను ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించి, దాడికి పాల్పడిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను,” అని తెలిపారు.
August 1st : ఈ నెలలో మారిన రూల్స్..కొత్త వచ్చిన వచ్చిన రూల్స్ ఇవే ..!!!
అధికారుల పట్ల గౌరవంగా వ్యవహరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఎవరు అయినా దురుసుగా ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి బాధ్యుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజలలో నడిచే స్థానిక నాయకులు ఇలా వ్యవహరించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
“ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ప్రజా జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న వారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉండే వారే ఈ రీతిగా ప్రవర్తిస్తే నైతికంగా ఆ స్థాయికి తగినట్టుండదు. అధికారుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం అంగీకరించదగినది కాదు,” అని ఆయన గట్టిగా అన్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే ప్రజాప్రతినిధులు సైతం నియమాలను గౌరవిస్తూ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ప్రజా సేవకు కట్టుబడి ఉన్న పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Kaleshwaram Project : మీరు కాళేశ్వరం కడితే తప్పులేదు..మీము బనకచర్ల కడితే తప్పేంటి..? – నారా లోకేష్