Site icon HashtagU Telugu

Electric Buses : రాబోయే ఐదేళ్లలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే.. ఏపీ ఆర్టీసీ ప్లాన్

Apsrtc Electric Buses Andhra Pradesh

Electric Buses : వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. 2029 నాటికి ఆర్టీసీకి చెందిన  డీజిల్‌ బస్సుల స్థానాన్ని పూర్తిస్థాయిలో  ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. టీడీపీ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘విద్యుత్‌ వాహనాల విధానం 2024-29’కి (Electric Buses) అనుగుణంగా ఈ లక్ష్యంతో  ఏపీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతోంది. 2029 సంవత్సరంకల్లా ఆర్టీసీ సొంత బస్సులు 10,155, అద్దె బస్సులు 2,562 కలుపుకొని మొత్తం 12,717 బస్సులు ఎలక్ట్రిక్‌వే ఉండేలా ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర సగటున రూ.1.80 కోట్ల దాకా ఉంటుంది. ఇంత ధర పెట్టి కొనడం ఆర్టీసీకి భారమే అవుతుందని అంటున్నారు. ఏపీలోని 11 నగరాలకు ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవ పథకం కింద 750 ఎలక్ట్రిక్  బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతిలకు 50 చొప్పున మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.35 లక్షల దాకా ఆయా కంపెనీలకు  సబ్సిడీ ఇస్తోంది.

Also Read :Formula E Car Race : రేపోమాపో కేటీఆర్‌పై కేసు.. గవర్నర్ అనుమతి వివరాలు ఏసీబీకి !

Also Read :Travel Tips : మీరు ఆన్‌లైన్‌లో హోటల్ లేదా గదిని బుక్ చేస్తుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోండి