APSRTC : వైజాగ్ T20 మ్యాచ్ కోసం ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న ఏపీఎస్ఆర్టీసీ

ఇండియా ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేడు వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. అయితే స్టేడియంకు వెళ్లే ప్రేక్ష‌కుల కోసం

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 07:30 AM IST

ఇండియా ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేడు వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. అయితే స్టేడియంకు వెళ్లే ప్రేక్ష‌కుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఆర్టీసీ పలు సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది. రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ప‌లు ప్రాంతాల నుంచి బ‌స్సులు బ‌య‌లుదేర‌నున్నాయి. OHPO (25P, 25D, 25E), రైల్వే స్టేషన్ (25R, 25J), RK బీచ్ (25M) నుండి బస్సులు విశాఖ వ్యాలీ స్కూల్, IT జంక్షన్, లా కాలేజీ మీదుగా క్రికెట్ స్టేడియానికి వెళ్తాయి. తగరపువలస, విజయనగరం, శ్రీకాకుళం నుండి బస్సులు మధ్యాహ్నం 2:00 గంటల నుండి నడుస్తాయి. హనుమంతవాక, ఆదివవరం, శొంత్యం, ఆనందపురం మీదుగా. తిరుగు ప్ర‌యాణంలో బస్సులు మారికవలస, బీచ్ రోడ్ మరియు MVP రోడ్ మీదుగా వెళ్తాయి. కూర్మన్నపాలెం (హైవే), పాత గాజువాక (సింధియా), రైల్వే స్టేషన్, పోస్టాఫీసు, పెందుర్తి (ఆదివవరం మీదుగా) నుండి క్రికెట్ స్టేడియంకు ప్రత్యేక బస్సులు కూడా నడువ‌నున్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత, సుమారు 10:00 గంటల నుండి వివిధ మార్గాల్లో క్రికెట్ స్టేడియం నుండి బస్సులు తిరిగి గ‌మ్య‌స్తానాల‌కు వెళ్ల‌నున్న‌ట్లు ఆర్టీసీ అధాకారులు తెలిపారు.

Also Read:  TDP vs YCP : పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో సంసారం చేసేవాడు దేవినేని ఉమా.. శ‌వాల ద‌గ్గ‌ర చిల్ల‌ర రాజ‌కీయమా..?