పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. పాత బకాయిలతో పాటు వడ్డీ, ఆస్తి పన్ను ఒకేసారి చెల్లిస్తే 5శాతం రాయితీ ఇవ్వడానికి సిద్ధం అయింది. జూలై 31వ తేదీ లోగా చెల్లించిన వాళ్లకు ఈ ఆఫర్ వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఏపీఐఐసీ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది. ఇలాంటి సరికొత్త స్కీమ్ పై విపక్షాలు విమర్శలు మొదలు పెట్టారు. ఆదాయ వనరులను పెంచుకునేందుకే ఈ ఆఫర్ను ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపణలకు దిగారు.