Politics : కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం

Politics : పాఠశాలల్లో రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Ap Govt School Poltics

Ap Govt School Poltics

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం (AP Govt) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేసింది. పాఠశాలల్లో రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణాలను రాజకీయాలకు అతీతంగా, విద్యా వాతావరణానికి అనుకూలంగా మార్చే దిశగా ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే.. పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదు అని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, బయటి విద్యార్థులతో ఇతర వ్యక్తులు ఫోటోలు దిగడం కూడా నిషేధమని జీవోలో స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిబంధనలు నిదర్శనమని చెప్పవచ్చు.

Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద విద్యార్థులకు రవాణా అలవెన్స్ (ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్) అందిస్తోంది. నెలకు రూ.600 చొప్పున, మొత్తం 10 నెలలకు గాను రూ.6 వేలను ప్రభుత్వం విద్యార్థులకు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులకు విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

  Last Updated: 02 Aug 2025, 09:14 AM IST