AP Village Secretariats: నిర్లక్ష్యపు నీడలో ఏపీ గ్రామ సచివాలయాలు!

వార్డు, గ్రామ సచివాలయాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన.

Published By: HashtagU Telugu Desk
Secretariats1

Secretariats1

వార్డు, గ్రామ సచివాలయాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన. ఈ వ్యవస్థతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని జగన్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఈ సచివాలయాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్రంలోని చాలా సచివాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయడం లేదు. విద్యుత్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. చాలా జిల్లాల్లో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అద్దెలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఏడాది కాలంగా విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. భవన యజమానులు కార్యాలయాలకు తాళాలు వేసి సిబ్బందిని అవమానించిన సందర్భాలు చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాలకు కూడా విద్యుత్‌ను నిలిపివేసింది. చాలా సచివాలయాల్లో స్టేషనరీ కొనుగోలుకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో సిబ్బంది సొంతంగా స్టేషనరీ కొనుగోలు చేయాల్సి వస్తోంది. జగన్ తన మానస పుత్రిక అని, పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకునే జగన్, వీటి మీద ఎప్పుడు ద్రుష్టిసారిస్తారోనని ఆశగా ఎదరుచూస్తున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులు.

  Last Updated: 01 Sep 2022, 12:39 PM IST