సంక్రాంతి (Sankranti) పండుగకు ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ (DA)ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల (AP Employees) సంఘాలు, సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి రెండు డీఏలతో పాటు పెండింగ్ బకాయిలు, బకాయిలు విడుదల చేయాలని కోరారు. జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి హృదయరాజు మాట్లాడుతూ ప్రతినిధి బృందం సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించామన్నారు.
పీఆర్సీ కమిటీని నియమించాలని, పెండింగ్లో ఉన్న 11 పీఆర్సీ బకాయిలను క్లియర్ చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని ఇరువురు నేతలు కోరినట్లు తెలిపారు. సీఎం (CM Jagan) సానుకూలంగా స్పందించి, డీఏ విడుదల చేసి ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారని వారు (AP Employees) తెలిపారు. ఇతర సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, సంఘం ప్రతినిధులు ఆస్కార్రావు, రమేష్ కుమార్ ఇటీవల సీఎంను కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కళాపలతారెడ్డి, పీఆర్టీయూ-ఏపీ అధ్యక్షుడు గిరిప్రసాద్రెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (AP Employees) అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Pawan Kalyan Divorce Rumours: మూడో భార్యకు ‘పవన్ కళ్యాణ్’ విడాకులు ఇవ్వబోతున్నారా?