ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన నవరత్నాల చుట్టూ 2023-24 అంచనా బడ్జెట్ (AP Budget) కనిపిస్తోంది. సంక్షేమానికి (Welfare )పెద్ద పీట వేస్తూ అభివృద్ధి దిశగా నిధుల కేటాయింపు దాదాపు శూన్యంగా చూపించారు. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికల దిశగా బడ్జెట్ కేటాయింపులు కనిపిస్తున్నాయి. రెవెన్యూ లోటును రూ. 22,316 కోట్లుగా చూపుతూ అత్యధికంగా పెన్షన్లకు ఎక్కువ కేటాయింపు చూపారు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం తదితరాలకు ఏ మాత్రం కేటాయింపులు కనిపించకుండా రూపొందించిన బడ్జెట్ లోని హైలెట్స్ ఇలా ఉన్నాయి.
వ్యవసాయ యాంత్రీకరణకు – 1,212 కోట్లు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. బడ్జెట్ (AP Budget)సమావేశానికి అడ్డుపడుతున్నారంటూ వారిపై ఒక రోజుపాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ పట్టుపట్టారు. బుగ్గన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ క్రమంలో తెలుగుదేశం సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సంప్రదాయాలను పాటించాలంటూ హితవు పలికారు. స్పీకర్ కూడా టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ సభ్యులు మాత్రం తమ నిరసన కొనసాగించారు. దీంతో.. వారిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన సభలో ఓ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన స్పీకర్ టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
Also Read : CM Jagan: విశాఖ నుంచే పరిపాలన : ఏపీ సీఎం జగన్