YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ !

మాజీ మంత్రి , ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. మొన్నటి వరకు అనధికారికంగా ఉన్న మరో వివాహ బంధం తాలూకూ అనుమానాలను రేపారు.

  • Written By:
  • Updated On - April 12, 2023 / 11:49 AM IST

YS Vivekananda Reddy: మాజీ మంత్రి , ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. మొన్నటి వరకు అనధికారికంగా ఉన్న మరో వివాహ బంధం తాలూకూ అనుమానాలను రేపారు. ఆస్తుల గొడవ అంటూ ఏకంగా ఆయన కుమార్తె సునీత మీద అపోహలు కలిగించేలా అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ ఇచ్చారని ప్రచారం జరిగింది.

హత్య కేసులో సూత్రధారిగా అవినాష్ ను సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇప్పుడు మరో కొత్త కోణం తెలంగాణ హైకోర్టులో ఆవిష్కరణ జరిగింది. అదేమంటే, సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది పేర్కొన్నారు. దస్తగిరి అప్రూవర్‌ను సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా సునీల్ యాదవ్ తల్లి‌ని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని వెల్లడైంది.

కక్ష కట్టి సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. అంతే కాదు ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారం‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారని, రాంసింగ్ వ్యక్తి గతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని నిందితుడు భార్య తులసమ్మ వాదనలు వినిపించింది. దీంతో రామ్ సింగ్ వ్యవహారం పై అనుమానాలు రావడం తో కొత్త ఐవో‌ను నియమించిందన్నారు. కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఏది  అని న్యాయస్థానం ప్రశ్నించింది.

నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను పిటిషనర్ తరుపు న్యాయవాది అందించారు. గూగుల్ టెక్ ఔట్‌‌ను ఆధారంగా చేసుకొని ఎలా తమను కేసులో పెడతారని ప్రశ్నించారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరి‌ని అప్రూవర్‌గా మార్చారని ఆరోపించారు. తదుపరి విచారణ గురువారం నాటికి కోర్టు వాయిదా వేసింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టును కోరారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లోనే మధ్యంతర పిటిషన్‌ వేశారు. గత నెల 14న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని హైకోర్టు ఆదేశించింది.