ఏపీలో తాలిబ‌న్ల లింకు.. డ్ర‌గ్స్ వెనుక డాన్ ఎవ‌రు?

ఏపీలో తాలిబన్ల క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది. సుమారు 9వేల కోట్ల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తాడేప‌ల్లి, తాలిబ‌న్ల‌కు ఉన్న సంబంధంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తాడేప‌ల్లి,తాలిబ‌న్ల‌కు ఉన్న లింకు ఏంటో తేల్చాల‌ని కేంద్రాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 21, 2021 / 03:33 PM IST

ఏపీలో తాలిబన్ల క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది. సుమారు 9వేల కోట్ల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తాడేప‌ల్లి, తాలిబ‌న్ల‌కు ఉన్న సంబంధంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తాడేప‌ల్లి,తాలిబ‌న్ల‌కు ఉన్న లింకు ఏంటో తేల్చాల‌ని కేంద్రాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. చాలా కాలంగా ఏపీలోని లిక్క‌ర్ బ్రాండ్ల వ్య‌వ‌హారం వివాద‌స్పదంగా ఉంది. హెరాయిన్ ను త‌క్కువ రేటులో మ‌ద్యం త‌యారీకి ఉప‌యోగిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌ల ఎస్పీ వై ఆగ్రోస్ తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఒరిస్సా రాష్ట్రాల్లో మ‌ద్యం కొనుగోళ్ల‌ను నిలిపివేసింది. హెరాయిన్ తో క‌లిపి మ‌ద్యాన్ని ఆ సంస్థ త‌యారు చేస్తుంద‌ని రాజ‌కీయంగా కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.
ర‌సాయన సంయోగం ప్ర‌కారం ఆర్వో నీళ్లలో సింథ‌టిక్ రంగు, సింథ‌టిక్ స్పిరిట్ ఫ్లేవ‌ర్ ,హెరాయిన్ క‌లిపితే, మ‌ద్యం త‌యారు అవుతుంది. ఇదే ఫార్ములాను ఎస్పీవై సంస్థ అనురించి మ‌ద్యాన్ని త‌యారు చేసి ఏపీకి ఇస్తుందా? అనే అనుమానాలు విప‌క్ష‌ల నుంచి వ‌స్తున్నాయి. వీటి తెర‌దింపాలంటే విజ‌య‌వాడ‌లో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ లింకుల‌ను లాగాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు రంగంలోకి దిగాల‌ని, తాడేప‌ల్లి, తాలిబ‌న్ సంబంధాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని కేంద్రాన్ని విప‌క్ష నేత‌లు కోరుతున్నారు.
తాలిబ‌న్, తాడేప‌ల్లికి లింకు పెడుతూ ఎందుకు విప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి? అని ప్ర‌శ్నించుకుంటే…దాని వెనుక క‌థ ఇది…హెరాయిన్ కాంద‌హార్ నుంచి ఆప్ఘ‌నిస్తాన్ కు స‌ర‌ఫ‌రా అయింది. అక్క‌డ నుంచి గుజ‌రాత్ లోని కుచ్ వ‌ద్ద ఉన్న ముద్రా పోర్ట్ కు వెళ్లింది. గుజ‌రాత్ పోర్టు నుంచి విజ‌య‌వాడ‌కు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మ‌గ్లింగ్ జ‌రిగింది. దాన్ని సీజ్ చేయ‌డంతో ఆప్గ‌నిస్తాన్ లింకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. విజ‌య‌వాడ‌లో ఎవ‌రికి ఇవ్వ‌డానికి ఆ డ్ర‌గ్స్ ను తీసుకొచ్చారు? 9వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మ‌గ్లింగ్ అంటే పెద్ద త‌ల‌కాయ‌లు దీని వెనుక ఉంటాయ‌ని నిఘా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఆ పెద్ద త‌ల‌కాయ‌లను బ‌య‌ట‌పెట్టాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు అస‌లు నిజాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని విప‌క్షాల డిమాండ్. అందుకే, తాడేప‌ల్లి, తాలిబ‌న్ లింకు అంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు.