Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Sharmila) నిత్యం ఏదో ఒక విషయమై తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆమె విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని ఆమె విమర్శలు చేశారు. మరోవైపు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అన్ని పార్టీలు ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా @AmitShah చేసిన వ్యాఖ్యలు బీజేపీ @BJP4India అహంకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని…
— YS Sharmila (@realyssharmila) December 19, 2024
షర్మిల తన ట్వీట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యింది. అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలి. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏపీ క్రాంగెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నా అని ఆమె ట్వీట్ చేశారు.
Also Read: Encounter: భీకర ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు మృతి!
రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తుందని అమిత్ షా అంటున్నారు.