CBN Gratitude Concert : హైటెక్ సిటీ.. హైదరాబాద్ సిగలో కలికితురాయి. 1998లో హైటెక్ సిటీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు అంకురార్పణ చేశారు. ఇప్పుడిది హైదరాబాద్ మహానగరంలో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. హైటెక్ సిటీని నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ (అక్టోబరు 29) ఐటీ ఉద్యోగులు ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’ పేరుతో హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. 25 ఏళ్ల క్రితమే ‘విజన్-2020’ నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన చంద్రబాబు దార్శనికతపై ఈ వేడుకల్లో చర్చించనున్నారు. హైటెక్ సిటీ సృష్టికర్త చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్ష మంది వరకు తరలి వస్తారని అంచనా. దేశ, విదేశాల నుంచి భారీగా చంద్రబాబు అభిమానులు హాజరుకానున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ ప్రోగ్రాం కోసం స్టేడియం చుట్టూ భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. తెలుగు ఐటీ నిపుణుల టీమ్ ఈ ప్రోగ్రాం ఏర్పాట్లను పరిశీలిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళనలు మొదలుపెట్టారు. హైదరాబాద్లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు సపోర్ట్గా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బ్లాక్ డ్రెస్లతో ఆఫీసులకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇటు మెట్రో రైలులో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా బ్లాక్ డ్రెస్లతో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహించనున్న ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’ కార్యక్రమం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.