Nurse Nimisha Priya: భారతీయ నర్సు నిమిషా ప్రియా (Nurse Nimisha Priya)కు రేపు అంటే బుధవారం యెమెన్లో మరణశిక్ష అమలు కానుంది. నిమిషా 2017 నుంచి జైలులో ఉన్నారు. ఆమెపై యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహ్దీకి డ్రగ్ ఓవర్డోస్ ఇచ్చి హత్య చేసిన ఆరోపణలు ఉన్నాయి. నిమిషా.. మహ్దీ యెమెన్లో ఒక ప్రైవేట్ క్లినిక్లో భాగస్వాములుగా ఉన్నారు. మహ్దీ నిమిషా పాస్పోర్ట్ను తన ఆధీనంలో ఉంచుకొని, ఆమెను వేధించాడని ఆరోపణలు ఉన్నాయి.
నిమిషాను మరణశిక్ష నుంచి కాపాడేందుకు దౌత్యపరమైన స్థాయిలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఫలించలేదు. యెమెన్లో మరణశిక్ష ఎలా అమలు చేస్తారో తెలుసుకుందాం.
గుండె దగ్గర కాల్పులు జరుపుతారు?
యెమెన్లో మరణశిక్ష కేవలం కాల్పుల ద్వారానే అమలు చేస్తారు. రాళ్లతో కొట్టడం, ఉరితీయడం, తల నరికివేయడం వంటి నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని ఉపయోగించరు. కాల్పులకు ముందు నిందితుడిని ఒక కార్పెట్ లేదా దుప్పటిపై ముఖం కిందకు పడుకోబెట్టతారు. ఆ తర్వాత డాక్టర్ నిందితుడి వీపు మీద గుండె ఉన్న చోట ఒక గుర్తు పెడతాడు. ఆపై జల్లాదు ఆటోమేటిక్ రైఫిల్తో వీపులో కాల్పులు జరుపుతాడు. కొన్ని సందర్భాల్లో మరణశిక్షకు ముందు కొరడాతో కొట్టే శిక్ష కూడా ఇస్తారు.
యెమెన్లో ఇస్లాం త్యజించినా మరణశిక్ష
యెమెన్ పీనల్ కోడ్ ప్రకారం కిసాస్, హుదూద్, తాజీర్ కింద మరణశిక్ష విధించే నిబంధన ఉంది.
కిసాస్: కంటికి కన్ను నియమం. దీని కింద హత్య కేసుల్లో బాధిత కుటుంబం బ్లడ్ మనీ తీసుకొని క్షమాపణ ఇచ్చే అధికారం కలిగి ఉంటుంది.
హుదూద్ నేరాలు: వ్యభిచారం, స్వలింగ సంపర్కం, మతత్యాగం, దోపిడీ వంటి నేరాలకు షరియా కింద మరణశిక్ష విధించవచ్చు.
తాజీర్: ఉగ్రవాదం, గూఢచర్యం, దేశద్రోహం వంటి తీవ్ర నేరాలకు మరణశిక్ష విధించవచ్చు.
బ్లడ్ మనీ మాత్రమే చివరి ఆశ
నిమిషా ప్రాణాలను కాపాడేందుకు ఇప్పుడు బ్లడ్ మనీ మాత్రమే చివరి ఆశ. అయితే భారత ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో నిమిషా ప్రియా కేసులో ఎక్కువ చేయలేమని తెలిపింది. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఇలా అన్నారు. మేము ఒక పరిమితి వరకు మాత్రమే వెళ్లగలం. ఆ పరిమితిని మేము ఇప్పటికే చేరుకున్నామన్నారు. ‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ లాయర్ కోర్టుకు తెలిపిన ప్రకారం.. బాధితుడి కుటుంబం ‘బ్లడ్ మనీ’ (పరిహారం) అంగీకరిస్తేనే ఏకైక మార్గం ఉంది. కుటుంబానికి 10 లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు 8.5 కోట్ల రూపాయలు) ఆఫర్ చేశారు. కానీ వారు దానిని తిరస్కరించారు. ఈ కేసు తమ గౌరవంతో ముడిపడి ఉందని కుటుంబం తెలిపింది.
Also Read: Why India Lost: టీమిండియా ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలివే!
తలాల్ అబ్దో మహ్దీ హత్య కేసు పూర్తి వివరాలు
- 2008: కేరళలోని పలక్కడ్కు చెందిన 19 ఏళ్ల నిమిషా ప్రియా ఉద్యోగం కోసం యెమెన్కు వెళ్లారు. రాజధాని సనాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం పొందారు.
- 2011: నిమిషా వివాహం కోసం భారత్కు తిరిగి వచ్చారు. కొచ్చికి చెందిన టామీ థామస్ను వివాహం చేసుకొని, ఇద్దరూ యెమెన్కు వెళ్లారు. అక్కడ థామస్కు ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్గా ఉద్యోగం లభించింది. కానీ జీతం చాలా తక్కువగా ఉండేది.
- 2012: నిమిషా తన కుమార్తె మిషాల్కు జన్మనిచ్చారు. కానీ యెమెన్లో జీవనం కష్టంగా మారింది.
- 2014: థామస్ కుమార్తెతో కొచ్చికి తిరిగి వెళ్లారు. అక్కడ ఈ-రిక్షా నడపడం ప్రారంభించారు. నిమిషా తక్కువ జీతం ఉద్యోగాన్ని వదిలి క్లినిక్ ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ యెమెన్ చట్టాల ప్రకారం ఆమెకు స్థానిక భాగస్వామి అవసరం. ఈ సమయంలో నిమిషా బట్టల దుకాణం నడుపుతున్న మహ్దీని కలిసారు. మహ్దీ భార్య ప్రసవాన్ని నిమిషా నిర్వహించారు.
- 2015: నిమిషా తన కుమార్తె మిషాల్ను కలవడానికి భారత్కు వచ్చారు. మహ్దీ కూడా ఆమెతో భారత్కు వచ్చాడు.
ఈ సమయంలో మహ్దీ నిమిషా వివాహ ఫోటోను దొంగిలించాడు. తర్వాత ఆ ఫోటోలో మార్పులు చేసి నిమిషా భర్తగా తనను తాను చెప్పుకున్నాడు. - క్లినిక్ ప్రారంభించడానికి నిమిషా కుటుంబం, స్నేహితుల నుంచి సుమారు 50 లక్షల రూపాయలు సేకరించి యెమెన్లో క్లినిక్ ప్రారంభించారు.
నిమిషా తన భర్త, కుమార్తెను యెమెన్కు రప్పించేందుకు కాగితాల పనులు ప్రారంభించారు. కానీ మార్చిలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. వారు యెమెన్కు రాలేకపోయారు. - యెమెన్లో అంతర్యుద్ధం కారణంగా భారత్ తన పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ రాహత్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఏప్రిల్-మే 2015 వరకు జరిగింది. దీనిలో 4,600 మంది భారతీయులు, సుమారు వెయ్యి మంది విదేశీ పౌరులను తరలించారు. కానీ నిమిషా మాత్రం భారత్కు తిరిగి రాలేకపోయారు.
- 2016: మహ్దీ నిమిషాపై శారీరక వేధింపులు ప్రారంభించాడు. ఆమె క్లినిక్ లాభాలను కూడా తీసుకున్నాడు. నిమిషా దీని గురించి ప్రశ్నించినప్పుడు వారి సంబంధాలు దెబ్బతిన్నాయి. మహ్దీ నిమిషాను యెమెన్ నుంచి బయటకు వెళ్లనివ్వకూడదని ఆమె పాస్పోర్ట్ను తన వద్ద ఉంచుకున్నాడు. నిమిషా మహ్దీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు మహ్దీ ఎడిట్ చేసిన ఫోటో చూపించి నిమిషా భర్తగా చెప్పుకోవడంతో నిమిషాను 6 రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు.
నిమిషా డ్రగ్స్ ఓవర్డోస్ ఇవ్వటంతో మహ్దీ మరణించాడు
నిమిషా తీవ్ర ఒత్తిడిలో ఉంది. జులై 2017లో మహ్దీ నుంచి పాస్పోర్ట్ తీసుకోవడానికి ఆమె అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. కానీ అది పని చేయలేదు. ఆ తర్వాత నిమిషా మహ్దీకి ఓవర్డోస్ ఇచ్చింది. దీనితో అతను మరణించాడు. మీడియా నివేదికల ప్రకారం.. నిమిషా మహ్దీ శరీరాన్ని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్లో పడేసింది. ఆ తర్వాత పోలీసులు నిమిషాను అరెస్ట్ చేశారు.
యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషాకు మహ్దీ హత్య ఆరోపణలపై మరణశిక్ష విధించింది. నిమిషా యెమెన్ సుప్రీం కోర్టులో క్షమాపణ కోరుతూ అపీల్ చేసింది. దానిని 2023లో తిరస్కరించారు. రాష్ట్రపతి రషద్ కూడా డిసెంబర్ 30, 2024న శిక్షకు ఆమోదం తెలిపారు.
బ్లడ్ మనీ ద్వారా నిమిషాను కాపాడే ప్రయత్నం
నిమిషాకు క్షమాపణ లభించేందుకు ఆమె తల్లి తన ఆస్తిని అమ్మి, క్రౌడ్ఫండింగ్ ద్వారా బ్లడ్ మనీ సేకరించే ప్రయత్నం చేసింది. 2020లో నిమిషాను శిక్ష నుంచి కాపాడేందుకు బ్లడ్ మనీ సేకరించేందుకు ‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ ఏర్పాటైంది. కేరళకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త నిమిషాను కాపాడేందుకు 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. షరియా చట్టం ప్రకారం.. బాధిత పక్షానికి నేరస్థుల శిక్షను నిర్ణయించే హక్కు ఉంది. హత్య కేసుల్లో మరణశిక్ష ఉంటుంద. కానీ బాధిత కుటుంబం డబ్బు తీసుకొని నిందితుడిని క్షమించవచ్చు. దీనిని ‘దియా’ లేదా ‘బ్లడ్ మనీ’ అంటారు. దీని గురించి కురాన్లో కూడా ప్రస్తావించబడింది.