Yemen: యెమెన్ తీరంలో మరోసారి వలసదారుల ప్రాణాలు బలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 154 మంది ఆఫ్రికన్ వలసదారులను తీసుకెళ్తున్న ఓడ అడెన్ గల్ఫ్లో బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 68 మంది మృతి చెందగా, మరో 74 మంది ఇప్పటికీ గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ (IOM) ధ్రువీకరించింది.
యెమెన్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీల్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు కేవలం 10 మందిని మాత్రమే సజీవంగా రక్షించారు. వీరిలో తొమ్మిది మంది ఇథియోపియన్ జాతీయులు కాగా, ఒకరు యెమెన్కు చెందినవారు. మిగిలిన వారి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని ఆయన అన్నారు.
Tape Warm : ప్రపంచదేశాలను వణికిస్తున్న వైరస్.. ఇలా చేయకపోతే మీ నాడీ వ్యవస్థ మొత్తం కోలాప్స్
ఐఓఎం ప్రకారం, ఈ పడవలో ఉన్న 154 మంది అందరూ ఇథియోపియన్ వలసదారులే. వీరు ప్రమాదకరమైన సముద్ర మార్గం గుండా యెమెన్లోని అబ్యాన్ ప్రావిన్స్ వద్ద అడెన్ గల్ఫ్ దాటే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ మార్గం “హార్న్ ఆఫ్ ఆఫ్రికా – గల్ఫ్ రూట్”గా పిలువబడుతూ అత్యంత ప్రమాదకరంగా పరిగణించబడుతుంది.
ఇథియోపియా, సోమాలియా వంటి దేశాల నుంచి వేలాది మంది వలసదారులు ప్రతీ సంవత్సరం గల్ఫ్ దేశాల్లో పని దొరకాలనే ఆశతో ఈ సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వీరి గమ్యస్థానాలు సాధారణంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు. కానీ ఈ మార్గం అనధికారికమైనదే కాకుండా, అత్యంత రద్దీగా, ప్రమాదకరంగా ఉంటుంది.
2024లో మాత్రమే 60,000 మందికి పైగా వలసదారులు ఈ మార్గం గుండా యెమెన్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అదే సంవత్సరంలో 558 మంది ఈ ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు. గత దశాబ్ద కాలంలో 2,082 మంది వలసదారులు కనిపించకుండా పోయారు, వీరిలో 693 మంది మునిగిపోయారని అధికారికంగా ధ్రువీకరించారు.
హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి యెమెన్ తీరానికి వెళ్తున్న సముద్ర మార్గం అత్యంత ప్రాణాంతకమని ఐఓఎం పదే పదే హెచ్చరించినప్పటికీ, జీవనోపాధి కోసం ఈ ప్రమాదాన్ని తీసుకోవడానికి వలసదారులు వెనుకాడడం లేదు.
Jagadeesh Vs Kavitha : కవిత జ్ఞానానికి నా జోహార్లు – జగదీష్ రెడ్డి కౌంటర్